అందెశ్రీ మరణం తెలంగాణకు తీరని లోటు: సీఎం రేవంత్, కేసీఆర్, కేటీఆర్ సంతాపం

V. Sai Krishna Reddy
1 Min Read

ప్రముఖ కవి, తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ రూపశిల్పి అందెశ్రీ ఆకస్మికంగా కన్నుమూశారు. ఆయన మరణవార్తతో తెలంగాణ సాహితీ లోకం దిగ్భ్రాంతికి గురైంది. అందెశ్రీ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సాహితీ శిఖరం నేలకూలింది: సీఎం రేవంత్ రెడ్డి

అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రాసిన సమయంలో ఆయనతో జరిపిన సంభాషణలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. తెలంగాణ సాహితీ శిఖరం నేలకూలిందని, స్వరాష్ట్ర సాధనలో ఆయన చేసిన కృషి చిరస్థాయిగా నిలిచిపోతుందని కొనియాడారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

తెలంగాణకు తీరని లోటు: కేసీఆర్

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా అందెశ్రీ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో తన పాటలతో, సాహిత్యంతో అందెశ్రీ కీలక పాత్ర పోషించారని అన్నారు. ఉద్యమ కాలంలో ఆయనతో తనకున్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. ఆయన మరణం తెలంగాణకు తీరని లోటని పేర్కొన్నారు.

అందెశ్రీ మరణం పట్ల కేటీఆర్ సంతాపం..

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం అందెశ్రీ అకాల మరణం పట్ల సంతాపం ప్రకటించారు. ఆయన మరణం తెలంగాణ సాహితీ రంగానికి, రాష్ట్రానికి పూడ్చలేని నష్టమని తెలిపారు. శోకసముద్రంలో మునిగిన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *