ఆలయాల్లో చోరీలు జరగకుండా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి

Kamareddy
1 Min Read

 హుండీ చోరీ సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్సై బోజ్జ మహేష్

ఎల్లారెడ్డి జూన్- 15 (ప్రజా జ్యోతి) ఆలయాల ఆవరణలో చోరీలు జరగకుండా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటే నేరాలు అరికట్టే అవకాశం ఉందని ఎల్లారెడ్డి ఎస్ఐ బొజ్జ మహేష్ అన్నారు. ఆదివారం ఎల్లారెడ్డి మండలంలోని హాజీపూర్ తండా గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటుపై తాండ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై బొజ్జ మహేష్ మాట్లాడుతూ.. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని సీసీ కెమెరాలు వల్ల భద్రత ప్రమాణాలు మెరుగవుతాయని అన్నారు. ప్రతి ఆలయానికి సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఏదైనా సంఘటనలు జరిగితే నిరాశలను తేలికగా గుర్తుపట్టవచ్చన్నారు. ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఇంటి యజమాని భాగస్వామ్యంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు గ్రామ పెద్దలు దాతలు సహకరించాలని సూచించారు.

 

*చోరీ సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్సై*

 

ఎల్లారెడ్డి మండలంలోని హాజీపూర్ తాండలోని జగదాంబ మాత, సేవాలాల్ ఆలయంలో శనివారం అర్ధరాత్రి జరిగిన హుండీ చోరీ సంఘటన స్థలాన్ని ఎస్సై బొజ్జ మహేష్ పరిశీలించారు. సంఘటన స్థలానికి చేరుకున్నా క్లూస్ టీం ఆధారాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం హాజీపూర్ తాండలో ఉన్న కిరాణం షాపులలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పూటేజీలను పరిశీలించారు. సీసీ పూటేజీ ఆధారంగా దొంగను పట్టుకుంటామని ఎస్సై బొజ్జ మహేష్ తెలిపారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *