తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో కుమ్ములాటలు ఓ రేంజ్లో జరుగుతున్నాయి. బయటకు అందరూ బాగానే ఉన్నట్టు కనిపిస్తారు. కానీ, లోలోన మాత్రం చాలా తీవ్రంగానే కుమ్మేసుకుంటున్నారు. అంతేకాదు.. ప్రభుత్వానికి సంబంధించిన కీలక విషయాలను కూడా.. నాయకులు కొందరు ప్రత్యర్థులకు లీకులు ఇస్తు న్నారన్న వాదన కూడా ప్రస్తుతం వినిపిస్తుండడం పార్టీలో ఉన్న అనైక్యతను పట్టి చూపుతోంది. ప్రధానం మూడు కారణాలతో కాంగ్రెస్ నాయకులు కుమ్మేసుకుంటున్నారు
1) ఆది నుంచి ఉన్న వర్గ పోరు. 2) ముఖ్యమంత్రికి వ్యతిరేక పక్షంగా ఏర్పడడం. 3) పదవుల పంపకాలపై అసంతృప్తి. ఈ మూడు ప్రధాన కారణాలు కూడా.. తెలంగాణ కాంగ్రెస్ను ప్రభావితం చేస్తున్నాయి. వాస్తవా నికి ఆది నుంచి కూడా కాంగ్రెస్లో వర్గపోరు ఉండనే ఉంది. ఒకరు ఎగదోస్తే.. మరొకరు దిగదోస్తున్న చం దంగా నాయకులు వ్యవహరిస్తున్నారు. దీంతో పార్టీ కార్యక్రమాల నుంచి ప్రభుత్వ కార్యకలాపాల వరకు కూడా కలివిడి లేని తనం కనిపిస్తూనే ఉంది. ఇప్పుడు అది మరింత ఎక్కువైంది.
ఇక, సీఎం రేవంత్రెడ్డిని వ్యతిరేకించే వర్గం అలానే ఉంది. చాలా మంది నాయకులు గత ఎన్నికలకు ముందు నుంచి కూడా రేవంత్రెడ్డిని వ్యతిరేకించారు. కొందరు సర్దుకు పోయారు. కానీ, మరికొందరు మా త్రం సర్దుకుపోకుండా.. చాపకింద నీరులా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు వీరు తమదైన శైలిలో కీలక విషయాలను పొరుగు ప్రత్యర్థి పార్టీలు, నేతలకు ఉప్పందిస్తూ.. సర్కారును ఇరకాటంలో పడేలా చేస్తున్నారన్న చర్చ ఉంది. ఇక, కొందరు మంత్రులు కూడా అంతర్గత చర్చల్లో ముఖ్యమంత్రితో విభేదిస్తున్నది అందరికీ తెలిసిందే.
ఇక, మూడో కీలక విషయం పదవుల పంపకం. మంత్రివర్గం నుంచి నామినేటెడ్ వరకు .. చాలా మంది నా యకులు ఈ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. అయితే.. చాలా మంది ఆశావహులకు పదవులు దక్క లేదు. ఇక, మంత్రి వర్గ విస్తరణ కూడా.. డోలాయమానంలో పడుతోంది. అదిగో ఇదిగో అంటూ.. ఊరిస్తున్నా .. దీనికి ముడిపడడంలేదు. మరోవైపు ఆశావహులు మాత్రం కారాలు మిరియాలు నూరుతున్నారు. ఈ ప్రభావం కూడా పాలనపై పడుతోంది. మొత్తంగా చూస్తే.. తెలంగాణ కాంగ్రెస్ పైకి కనిపిస్తున్నంత అందంగా మాత్రం లేదని అంటున్నారు పరిశీలకులు. మీనాక్షి నటరాజన్ కూడా ఎవరికీ ఏమీ చెప్పలేని పరిస్థితికి చేరుకున్నారన్న చర్చ కూడా ఉండడం గమనార్హం