పట్టా భూమి గుర్తించాలని రైతుల ఆందోళన
నిజాంసాగర్ జూన్ 5 ప్రజాజ్యోతి
ఈ బోరు బావి పైనే ఆధారపడ్డాం ఇప్పుడు పంట పండించేది ఎలా, పూట గడిచేది మరి ఎలా అని ఓ రైతు కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని నర్సింగ్ రావు పల్లి గ్రామ ఊర చెరువు కబ్జాకు గురైందని సంబంధిత అధికారులు జెసిబి సహాయంతో హద్దులను తవ్విస్తున్నారు. కాగా రైతుల పట్టా భూమి నుండి హద్దులు తీస్తున్నారని పలు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎంతో ఖర్చు చేసి బోర్ బావులను తవ్వించుకున్నాం ఇప్పుడు మా పొట్ట కొట్టదని ఓ రైతు కుటుంబం కోరింది. ఇప్పుడు వాటిని తీసేయాలంటే ఎలా అని రైతు కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. జేసిబి ఆందోళన చేయడంతో ఘటన స్థలానికి చేరుకున్నారు. ఉన్నత అధికారులు స్పందించి మళ్ళీ సర్వే చేసి న్యాయం చేయాలని రైతులు కోరుకుంటున్నారు.