పశువుల అక్రమ రవాణా నియంత్రణకు జిల్లాలో నిరంతర పర్యవేక్షణ
కామారెడ్డి జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర
కామారెడ్డి ప్రజాజ్యోతి ప్రతినిధి (జూన్ 04)
పశువుల అక్రమ రవాణాలను నియంత్రించేందుకు చెక్ పోస్టులను బుధవారం కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆకస్మికంగా తనిఖీ చేశారు.పశువుల అక్రమ రవాణా నియంత్రణకు జిల్లాలో నిరంతర పర్యవేక్షణ.చెక్పోస్ట్ వద్ద విధులు నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా ఉండి వాహనాలు తనిఖీ చేయాలి..కామారెడ్డి జిల్లాలో పశువుల అక్రమ రవాణాను నియంత్రించేందుకు జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర మాచారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘన్పూర్ చెక్పోస్ట్, భిక్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టోల్ప్లాజా,బస్వాపూర్ చెక్పోస్టులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పశువుల అక్రమ రవాణా నియంత్రణకు జిల్లాలో నిరంతర పర్యవేక్షణ నిబంధనలను ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది.చెక్పోస్ట్ వద్ద విధులు నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా ఉండి వాహనాలు తనిఖీ చేయాలని సూచించారు.రాత్రి సమయంలో తప్పకుండా టార్చ్ లైట్ ఉపయోగించాలని తెలిపారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, కామారెడ్డి జిల్లాలో పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లా సరిహద్దుల్లో మొత్తం ఏడు చెక్పోస్టులు ఏర్పాటు చేశామని, వీటిలో 24×7 నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. పోలీసు శాఖతో పాటు ఇతర సంబంధిత శాఖల సిబ్బంది సమన్వయంతో షిఫ్ట్ల వారీగా విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. చెక్పోస్టుల వద్ద వాహనాల తనిఖీ, వాహనాల ఎంట్రీ రికార్డుల పరిశీలనను స్వయంగా పరిశీలించి, అక్కడ విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి తగిన సూచనలు చేశారు.శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పశువుల రవాణా విషయంలో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా ముందస్తు చర్యగా ప్రత్యేక చెక్పోస్టులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.