ఆగి ఉన్న నాలుగు బైకులను కారు డికోన్న ఘటన మాచారెడ్డి మండల కేంద్రంలోని చౌరస్తాలో చోటుచేసుకుంది. ఉదయం 6:30 గంటల సమయంలో కారు వేములవాడ వెళుతున్న క్రమంలో చౌరస్తాలోని పార్కింగ్ చేసి ఉన్న నాలుగు బైకులను ఢీకొనడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలాయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వారిని వెంటనే అంబులెన్స్ లో ఏరియా ఆసుపత్రికి తరలించారు. స్థానికుల కథనం ప్రకారం డ్రైవర్ అజాగ్రత్తగా నడపడం వల్లనే యాక్సిడెంట్ కు గురయ్యాని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.