వేలంలో రూ.25 వేలు పలికిన నిమ్మకాయ

V. Sai Krishna Reddy
1 Min Read

తమిళనాడులో ఒక నిమ్మకాయ వేలం పాటలో రూ. 25 వేలు పలికింది. తమిళనాడు నూతన సంవత్సరం సందర్భంగా ఈరోడ్ జిల్లాలోని శివగిరిలో గల సదాయప్పస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి పూజలో ఉంచిన నిమ్మకాయను ఆలయ అధికారులు వేలం వేశారు.

ఈ వేలంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కందసామిపాలెం నుంచి వచ్చిన ఒక భక్తుడు రూ. 25 వేలకు ఆ నిమ్మకాయను సొంతం చేసుకున్నారు. తమిళనాడు నూతన సంవత్సరం సందర్భంగా ప్రతి సంవత్సరం స్వామి వారి పూజకు ఉపయోగించిన సామగ్రిని వేలం వేయడం ఆనవాయతీ అని ఆలయ అధికారులు తెలిపారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *