యూఎస్ వీసా : భారతీయుల సమయం, డబ్బు వృథా

V. Sai Krishna Reddy
1 Min Read

భారతీయ వీసా దరఖాస్తుదారులకు సమస్యలు తీరడం లేదు. యూఎస్ వీసా కోసం $200 చెల్లించినా, ఆన్‌లైన్ వ్యవస్థలో తప్పులు వారి ప్రయాణానికి మరొక అడ్డంకిగా మారాయి. దరఖాస్తును ఏ కారణం లేకుండానే పక్కనపెట్టడంపై ఒక భారతీయ అభ్యర్థి తన ఆవేదనను సోషల్ మీడియాలో పంచుకున్నాడు.అదే వైరల్ అయ్యింది.

ఆ భారతీయ అభ్యర్థి “నాకు అనేక యాక్సెస్ పరిమితి ఉల్లంఘన సమస్యలు వచ్చాయి, అందుకే నేను ఒక కేసు రైజ్ చేశాను. వారు కేసు పరిష్కరించామని చెప్పిన తర్వాత నా దరఖాస్తు రిజెక్ట్ చేశారు. ఇప్పుడు కొత్తగా దరఖాస్తు ప్రారంభించాలని అంటున్నారు” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు

కొంతమంది నెటిజన్లు అతనికి సహాయం చేస్తూ, ఒక ఏడాది వరకు చెల్లింపు అమలులో ఉంటుందని, అయితే రెండుసార్లు అపాయింట్‌మెంట్ క్యాన్సెల్ చేస్తే వీసా రద్దు అవుతుందని చెప్పారు. అయినప్పటికీ ఈ వ్యవస్థలోని లోపాలు తెలియని వ్యక్తుల కోసం ఆందోళన కలిగించే సమస్యగా మారాయి. ఇప్పటికే, వీసా దరఖాస్తుదారులు సుదీర్ఘ నిరీక్షా సమయాలు , క్లిష్టమైన విధానాలను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు తమ దరఖాస్తులు నిరాధారంగా రద్దు కావడం కూడా ఒక కొత్త సమస్యగా మారింది. చాలా మంది విద్య, ఉద్యోగం లేదా ప్రయాణాల కోసం ఈ వీసాపై ఆధారపడతారు. ఈ విధంగా సాంకేతిక లోపాల వల్ల సమయాన్ని డబ్బును కోల్పోవడం, వారి కష్టాలను మరింత పెంచుతోంది

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *