భారత్ మార్కెట్లోకి టెస్లా

V. Sai Krishna Reddy
2 Min Read

దిగ్గజ పారిశ్రామిక వేత్త టెస్లా.. ఎప్పటినుంచో భారత్‌లోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. భారత్ మాత్రం ఇక్కడే కార్లు తయారు చేయాలనే డిమాండ్ టెస్లా ముందుంచగా.. అందుకు టెస్లా ఒప్పుకోలేదని తెలిసింది. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీతో అమెరికా టెస్లా అధినేత ఎలాన్ మస్క్ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనికి ముందడుగు పడినట్లు సమాచారం.

అంతర్జాతీయ టెక్ దిగ్గజం.. ప్రపంచంలోనే అత్యంత కుబేరుడైన ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా.. భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. పలు కారణాలు ముఖ్యంగా సుంకాలు, తయారీకి సంబంధించి భిన్నాభిప్రాయాల నేపథ్యంలో.. ఇప్పటివరకు ఆ ప్రణాళికలు కార్యరూపం దాల్చలేదు. అయితే తాజాగా దీనికి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. టెస్లా ఎంట్రీ ఇచ్చేందుకు కీలక ముందడుగు పడినట్లు తెలుస్తోంది. ఇప్పుడు టెస్లా.. భారత్‌లో నియామకాల ప్రక్రియ చేపట్టి.. భారత్‌లోకి ఎంట్రీపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. తాజాగా టెస్లా నియామకాల కోసం ప్రకటన ఇచ్చినట్లు తెలుస్తోంది.

కొద్ది రోజుల కిందట ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. అమెరికా వెళ్లారు. అక్కడే టెస్లా అధినేత, ట్విట్టర్, స్పేస్ ఎక్స్ చీఫ్ ఎలాన్ మస్క్.. మోదీతో భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే ఆయన భేటీ అయిన కొద్దిరోజుల్లోనే తాజా పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇప్పుడు మొత్తం 13 విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి అభ్యర్థులు కావాలని టెస్లా.. సోమవారం రోజు తన లింక్డ్‌ఇన్ పేజీలో ప్రకటన చేసింది. దీంట్లో బ్యాక్‌ఎండ్ జాబ్ సహా కస్టమర్ రిలేటెడ్, సర్వీస్ అడ్వైజర్, మేనేజర్, స్టోర్ మేనేజర్ వంటివి ఉన్నాయి. సర్వీస్ టెక్నీషియన్, అడ్వైజరీ సహా కనీసం 5 పొజిషన్ల కోసం ఉద్యోగుల్ని ముంబై, ఢిల్లీ రెండు చోట్ల నియమించుకోనున్నట్లు తెలిపింది కంపెనీ. డెలివరీ ఆపరేషన్స్ స్పెషలిస్ట్, కస్టమర్ ఎంగేజ్‌మెంట్ మేనేజర్ వంటి విభాగాల్లో ఉద్యోగుల్ని ముంబై కేంద్రంగా తీసుకోనున్నట్లు ప్రకటనలో పేర్కొంది.

2021 సంవత్సరం నుంచే టెస్లా.. భారత మార్కెట్లోకి వచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. దీని కోసం అప్పట్లో ఈవీలపై దిగుమతి సుంకాల్ని గణనీయంగా తగ్గించాలని మస్క్ సంస్థ డిమాండ్ చేసింది. దీనికి కేంద్ర ప్రభుత్వం మాత్రం షరతులు విధించింది. భారత్‌లోనే తయారీ ప్రారంభించాలని.. ప్రాంతీయంగానే విడిభాగాలు కొనుగోలు చేయాలని కండిషన్ పెట్టింది. దీనికే మస్క్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అప్పటినుంచి టెస్లా ఎంట్రీ ఆలస్యం అవుతూ వస్తోంది.

ఇటీవల మోదీతో భేటీ సందర్భంగా మస్క్.. ఈ టెస్లా ఎంట్రీ గురించి.. సుంకాల అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఇటీవల భారత కరెన్సీలో దాదాపు రూ. 34 లక్షల కంటే ఖరీదైన హైఎండ్ కార్లపై బేసిక్ కస్టమ్స్ సుంకాల్ని 110 శాతం నుంచి 70 శాతానికి తగ్గించింది. దీంతో.. తాజా పరిణామాల నేపథ్యంలో త్వరలోనే భారత్ రోడ్లపై టెస్లా కార్లు చక్కర్లు కొట్టే అవకాశాలు కనిపిస్తున్నట్లు ఆటో రంగ నిపుణులు చెబుతున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *