వసంత పంచమి.. మహాకుంభమేళాకు పోటెత్తిన భక్తులు
వసంత పంచమి సందర్భంగా మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తారు. త్రివేణీసంగమంలో అమృత స్నానాలు ఆచరిస్తున్నారు. చలిని సైతం లెక్క చేయకుండా తెల్లవారుజాము నుంచే పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.
ఈరోజు(సోమవారం) ఒక్కరోజే 4 నుంచి 6 కోట్ల మంది భక్తులు రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మౌనీ అమావాస్య రోజు తొక్కిసలాట దృష్ట్యా యూపీ సర్కార్ భారీ ఏర్పాట్లు చేసింది.