కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తను ఎల్లవేళలా కంటికి రెప్పల కాపాడుకుంటుంది ..
వర్షాన్ని సైతం లెక్క చేయకుండా.. సీనియర్ కార్యకర్త అంత్యక్రియల్లో డిసీసీ అధ్యక్షులు ఇనుగాల వెంకట్రాంరెడ్డి.
దామెర (మహేందర్ రెడ్డి కరివేద), సెప్టెంబర్ 13 (ప్రజాజ్యోతి):
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఎల్లవేళలా కంటికి రెప్పలా కాపాడుకుంటుందని హనుమకొండ డిసిసి అధ్యక్షులు ఇనుగాల వెంకటరామిరెడ్డి తెలిపారు. దామెర మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అర్థం రాజు మరణo వార్త తెలుసుకున్న ఇనుగాల వెంకట్రాంరెడ్డి కార్యకర్త పార్ధిహా దేహానికి పూల మాల వేసి నివాళు అర్పించటం జరిగింది. వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వటం జరిగింది వారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు దామెర మండల పార్టీ అధ్యక్షులు దుబాసి రాజేందర్, మాజీ అధ్యక్షులు మన్నెం ప్రకాష్ రెడ్డి, సీనియర్ నాయకులు గుడిపాటి శ్రీధర్ రెడ్డి, సాధిరం పోషయ్య, పోలసాని అనిల్ రెడ్డి, దూరిశెట్టి బిక్షపతి, కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు నల్ల సుధాకర్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సధిరం లింగయ్య, డైరెక్టర్ సోనబోయిన రవి, దామెర శంకర్, ఇందిరమ్మ కమిటీ మెబర్ అమ్ముల రవి కుమార్, వార్డు సభ్యులు వంశీ, నితిన్, యూత్ నాయకులు వినోద్, ప్రశాంత్, కిన్నెర కోటి, దామెర రతన్, క్రాంతి, గణేష్ పాల్గొన్నారు.

