నేరేడుచర్ల జనవరి 26 (ప్రజా జ్యోతి)నేరేడుచర్ల మండల పరిధిలోని సోమవరం గ్రామంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సోమవరం గ్రామ పంచాయతీలో నిర్వహించిన 77వ గణతంత్ర దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ రహీముద్దీన్ ఉప సర్పంచ్ అడపూ గోపి కాంగ్రెస్ పార్టీ వార్డ్ మెంబర్స్ మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మరియు గ్రామ కార్యదర్శి మరియు సిబ్బందిలు ఆధ్వర్యంలో పతాకావిష్కరణను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ… ప్రపంచంలోనే అతిపెద్ద దృఢమైన లిఖిత రాజ్యాంగం అని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారతదేశం అన్ని దేశాల రాజ్యాంగం నుండి క్రోడీకరించి రాసినటువంటిదే మన భారత రాజ్యాంగం అని అన్నారు.
