ఇంగ్లీష్ అతిథి అధ్యాపక పోస్ట్ కు దరఖాస్తుల స్వీకరణ
… ప్రిన్సిపల్ డాక్టర్ సైదా జైనబ్
ప్రజాజ్యోతి నిజామాబాద్ ప్రతినిధి:
నిజామాబాద్ నగరంలోని నాగారం గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఇంగ్లీష్ బోధించేందుకు అర్హులైన అభ్యర్థు నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సైదా జైనబ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఏ, పీ హెచ్ డీ లేదా నెట్ లేదా సెట్ ఉత్తీర్ణులైన మహిళా అభ్యర్థులు ఈ నెల 27 వరకు తమ గురుకులంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. ఇది పూర్తి తాత్కాలిక పద్దతిన జరిగే నియామకమని, ఈ నెల 28 న డెమో ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు. పీ హెచ్ డీ పూర్తి చేసిన వారికి ప్రాధాన్యత కల్పిస్తామన్నారు.