నర్సాపూర్ (ప్రజాజ్యోతి) ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలవ్యాప్తంగా సోమవారం నుంచి మే 9 వరకు ‘రైతు వారోత్సవాలు’ నిర్వహించనున్నట్లు ఏఓ దీపిక తెలిపారు. సోమవారం ఉదయం 9 గంటలకు అన్ని రైతు వేదికల్లో నేల ఆరోగ్యం, ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పిస్తామన్నారు. వారం రోజుల పాటు పంట రుణాలు, యంత్రాల వినియోగంపై నిపుణులు సూచనలు ఇస్తారని, రైతులందరూ పాల్గొనాలని కోరారు.
