ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స కోసం వచ్చిన ఓ మహిళ మృతి – మూత్ర విసర్జన రావడం లేదంటూ చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరిన గిరిజన మహిళా

ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స కోసం వచ్చిన ఓ మహిళ మృతి - మూత్ర విసర్జన రావడం లేదంటూ చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరిన గిరిజన మహిళా - లక్ష రూపాయలు ఫీజు చెల్లించి ఆస్పత్రిలో చేర్చిన కుటుంబ సభ్యులు - ఆసుపత్రి వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు

Sunder Chary Staff Reporter
2 Min Read
Highlights
  • ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స కోసం వచ్చిన ఓ మహిళ మృతి - మూత్ర విసర్జన రావడం లేదంటూ చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరిన గిరిజన మహిళా - లక్ష రూపాయలు ఫీజు చెల్లించి ఆస్పత్రిలో చేర్చిన కుటుంబ సభ్యులు - ఆసుపత్రి వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు

 

ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స కోసం వచ్చిన ఓ మహిళ మృతి - మూత్ర విసర్జన రావడం లేదంటూ చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరిన గిరిజన మహిళా
ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స కోసం వచ్చిన ఓ మహిళ మృతి
– మూత్ర విసర్జన రావడం లేదంటూ చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరిన గిరిజన మహిళా

 ఫీజు చెల్లించి ఆస్పత్రిలో చేర్చిన కుటుంబ సభ్యులు

– ఆసుపత్రి వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు

 మహబూబ్ నగర్ జూలై 13 ( ప్రజా జ్యోతి జిల్లా ప్రతినిధి ) జిల్లా కేంద్రంలోనీ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఓ గిరిజన మహిళ యూరినరీ ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ వైద్యం కోసం వచ్చి మృతి చెందిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నారాయణపేట జిల్లా బోన్ పల్లి తండాకు చెందిన దేవమ్మ మూత్ర విసర్జన రాకపోవడంతో ­­జిల్లా కేంద్రంలోని యునైటెడ్ ఆసుపత్రి (United Hospitals)లో ఆదివారం చేరింది. ముందుగా రూ.1 లక్ష చెల్లించాలని వైద్యుల సూచన మేరకు హుటాహుటిన చికిత్స నిమిత్తం రూ.1 లక్ష చెల్లించారు. సోమవారం ఉదయం కూడా మరిన్ని డబ్బులు చెల్లించాలని ఆస్పత్రి వైద్యులు తెలియజేశారు.

బాగా అయిన తర్వాత చెల్లిస్తామని చెప్పడంతో ముందు మీరు అందరూ దేవమ్మకు మాకు సంబంధం లేదనే విధంగా సంతకాలు చేయాలని వైద్యులు సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు ముందుగా దేవమ్మ ఆరోగ్య పరిస్థితి తెలియజేయాలని ఆ తర్వాతనే చెల్లిస్తామని, సంతకాలు కూడా చేయబోమని వైద్యులను ఎదురు ప్రశ్నించారు. చివరగా వైద్యులు దేవమ్మ మరణించిందని తెలియజేశారు. దీంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టారు. దీంతో టూ టౌన్ సీఐ ఇజాజ్, ఎస్సై విజయ భాస్కర్ పోలీస్ బృందం ఆస్పత్రి వద్ద కు చేరుకుని కుటుంబ సభ్యులతో శాంతియుతంగా ఉండాలని ప్రైవేట్ ఆస్పత్రుల అసోసియేషన్ అధ్యక్షులు రామ్మోహన్, టూ టౌన్ సీఐ ఇజాజ్ కుటుంబ సభ్యులకు సర్దు చెబుతున్నారు. వైద్యుల నిర్లక్షం కారణంగా మృతి చెందిందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు కాగా ఈ విషయం లో మరింత వివరాలు తెలియాల్సి ఉంది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *