సూర్యాపేట జిల్లా కేంద్రంలో నవోదయ విద్యాలయం,కేంద్రీయ విద్యాలయం ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించుట కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరు కు కృషి చేసిన కేంద్ర హోం శాఖ మంత్రి కిషన్ రెడ్డికి బిజెపి జిల్లా నాయకులు మంచాల రంగయ్య ఆదివారం హైదరాబాదులో ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా మంచాల రంగయ్య మాట్లాడుతూ గత పది సంవత్సరాల కృషి ఫలితముగా ప్రతిష్టాత్మక నవోదయ,కేంద్రీయ పాఠశాలలు కేటాయించడం వలన తన చిరకాల స్వప్నం నెరవేరడం సంతోషంగా ఉందన్నారు.ఈ సంవత్సరం ఐదో తరగతి,6 వ తరగతి వారికి తాత్కాలికంగా రెడ్డి హాస్టల్లో ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు.ఆసక్తిగలవారు కళాశాల ప్రధానోపాధ్యాయులను సంప్రదించాలన్నారు.జవహర్ నవోదయ విద్యాలయం లో హాస్టల్ వసతి,కేంద్రీయ విద్యాలయంలో డే స్కాలర్స్ వసతి కలదని తెలిపారు.బాల బాలికలకు అడ్మిషన్లు లభించనని పూర్తి వివరాలు త్వరలో నోటిఫికేషన్ ద్వారా సమాచారం తెలియజేయునని తెలిపారు.