కాలభైరవ స్వామిని దర్శించుకున్న టిపిసిసి జనరల్ సెక్రెటరీ
— గిరిజ షెట్కర్
రామారెడ్డి జూన్ 28 (ప్రజాజ్యోతి)
రామారెడ్డి మండల కేంద్రంలోని ఈసనపల్లి- రామారెడ్డి గ్రామాలలో కొలువై ఉన్న అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం శ్రీ కాలభైరవ స్వామిని దర్శించుకోవడానికి శనివారం స్థానిక ఎంపీ సురేష్ షెత్కర్ కుమార్తె రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ టిపిసిసి జనరల్ సెక్రటరీ కాలభైరవ స్వామి వారిని దర్శించుకోవడానికి రావడం జరిగింది. ఆలయ సిబ్బంది.స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి శాలువాతో సత్కరించారు. తదనంతరం తీర్థ ప్రసాదాలు అందజేయడం జరిగింది. ఈ విషయంలో,స్వామివారికి ప్రత్యేక దర్శనం సంతోషకరంగా ఉందని గిరిజా సెట్కార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు ఏఎంసీ డైరెక్టర్ ఎండి రావుఫ్, రామారెడ్డి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తూర్పు రాజు, రామారెడ్డి మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు బండి ప్రవీణ్, నామాల రవి,గంగరాజాం గౌడ్, కామారెడ్డి రవి, రామ్ సింగ్, శ్రీశైలం, తదితరులు కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.