మహబూబ్ నగర్ జూన్ 23 ( ప్రజా జ్యోతి జిల్లా ప్రతినిధి ) ఎస్సీ కార్పొరేషన్ భూములను కాపాడండి అని సోమ వారం ప్రజావాణి లో మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి మిట్టమీది బాలరాజు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం మహబూబ్ నగర్ అర్బన్ మండలంలోని లక్ష్మీనగర్ కాలనీలో సర్వే నం. 247లో అనధికారికంగా కేటాయించిన భూమిని రద్దు చేసి, జరుగుతున్న నిర్మాణాన్ని వెంటనే నిలిపవేయాలని పిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్డ్ కాస్ట్ అభివృద్ధి సంస్థ కోసం ప్రత్యేకంగా కేటాయించిన భూమిపై జరిగిన అక్రమ కేటాయింపు మరియు అనధికారిక నిర్మాణం పనులు జరుగుతున్నాయని
1989 సంవత్సరంలో, జిల్లా కలెక్టర్ మహబూబ్నగర్ ఆధ్వర్యంలో ప్రొసీడింగ్ నెం. బి6/6261/88, తేదీ: 21-05-1989 ప్రకారం, సర్వే నంబర్లు 247, 250 లో ఉన్న 5 ఎకరాలు 30 గుంటల భూమిని షెడ్యూల్డ్ కాస్ట్ లబ్ధిదారుల అభివృద్ధి కోసం ఎస్సీ డీడి కి కు కేటాయించారని అయితే, 1991 సంవత్సరంలో, పట్టణ తహసీల్దార్ ఆయా భూములను ప్రతిసె. గజానికి రూ. 30/- చొప్పున విలువగా తీసుకొని పత్రిక విలేకరులు, మాజీ సైనికులు మరియు రెవెన్యూ ఉద్యోగులు కు తటస్థంగా కేటాయించారన్నారు. ఆ క్రమంలో మహ్మద్ గులాం మసూద్ అనే వ్యక్తి సర్వే నం. 247లో 300 చదరపు గజాల భూమిని పొందారు. వారు పట్టణ రెవెన్యూ కార్యాలయంలో టైపిస్ట్గా పనిచేశారని, అయితే, గులాం మసూద్ అప్పటికే డాకుమెంట్ నెం. 1456/1988 ద్వారా తాలూకా రెవెన్యూ ఎంప్లాయిస్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ద్వారా సర్వే నం. 211/1, యెనుగొండలో 200 చదరపు గజాల ప్లాట్ నం. 64ని పొందినట్లు రికార్డుల్లో ఉందని, ఒకే వ్యక్తికి రెండు సార్లు ప్రభుత్వ భూమి కేటాయించడాన్ని ప్రభుత్వ నిబంధనలు స్పష్టంగా నిషేధిస్తుండగ
కొంత మంది అధికారులు ఇట్టి విషయంలొ లోపాయకారి ఒప్పందం మేరకు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు, ప్రస్తుతం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు షోకాజ్ నోటీసు జారీ చేసినప్పటికీ, సదరు ఇంటి నిర్మాణం పనులు నిలిపివేత లేకుండా యదేచ్చగా నిర్మాణం కొనసాగుతోంది కావున ఇట్టి విషయంపై తగిన విచారణ చేపట్టి అక్రమ నిర్మాణాలను తొలగించి కార్పొరేషన్ భూములను కాపాడే తిరిగి కార్పొరేషన్ కు ఆ భూముల చెందేలా ఆదేశాలు జారీ చేయవలసిందిగా బాలరాజ్ కోరారు. అంతేకాకుండా ఫిర్యాదులో 1991లో గులాం మసూద్ గారికి సర్వే నం. 247లో చేసిన అక్రమ భూ కేటాయింపును తక్షణం రద్దు చేయాడం తో పాటు ప్రారంభ దశలో ఉన్న అక్రమ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని, . ఆ భూమిని మళ్లీ షెడ్యూల్డ్ కాస్ట్ అభివృద్ధి సంస్థ కి అప్పగించి, దళితుల అభ్యున్నతి కోసం తగిన విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చిన షోకాజ్ నోటీసును ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం తోపాటు, ఇట్టి భూములపై ఎలా అక్రమ కేటాయింపులు జరిగాయో, ఎలా ఆక్రమణలు జరిగాయో పూర్వాపరాల విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.