వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ విషయంలో ఏమి జరగనుంది. అసలు ఏపీ రాజకీయాల్లో కొత్త కుదుపులు ఉంటాయా, ఉంటే అవి రాజకీయ భూప్రకంపనలు సృష్టిస్తాయా అసలు ఏపీ రాజకీయాల్లో సంచనాలు నమోదు అవుతాయా అన్నది ఇపుడు అంతటా వినిపిస్తున్న మాట.
వైసీపీ అధినేత జగన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది అని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఏపీలో ఇపుడు లిక్కర్ స్కాం టాప్ న్యూస్ గా ఉంది. ఈ స్కాం లో కసిరెడ్డి రాజశేఖరరెడ్డి అరెస్టుతో కొన్ని కీలక విషయాలనే సిట్ నమోదు చేసింది అని అంటున్నారు. ఆ తరువాత చూస్తే ఇదే కేసుకు సంబంధించి ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను ఈ కేసులో చేర్చడంతో వైసీపీ అధినాయకత్వానికి చేరువగా తీగ వెళ్తోందా అన్న చర్చ సాగుతోంది.
ఇక ఇదే కేసులో 29 మంది మీద ఎఫ్ఐఆర్ నమోదు అయింది. మరో వైపు చూస్తే ఈ కేసులో శరవేగంగా పరిణామాలు మారుతున్నాయి. సిట్ సైతం దూకుడు పెంచింది. అన్ని వేళ్ళూ అన్ని తీగలు కలసి ఒక పెద్ద డొంకనే కదల్చబోతునాయని అంటున్నారు. కసిరెడ్డి తో పాటు కొందరు కీలక నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు జగన్ మీద కేసు నమోదు చేస్తారు అన్నది కూడా ప్రచారం సాగుతోంది. జగన్ మీద కేసు అంటే అంత తేలికగా తీసుకోకుండా పకడ్బందీ ఆధారాలతో కేసు నమోదు చేస్తారు అని అంటున్నారు.
దాంతో లిక్కర్ స్కాం ఏపీలో రాజకీయ రచ్చ సృష్టించనుంది అని అంటున్నారు. మరో వైపు చూస్తే కనుక గత వైసీపీ ప్రభుత్వంలో ఇసుక స్కాం మీద కూడా విచారణ చేస్తున్నారు అని అంటున్నారు. పోలీసులు ఈ విషయంలో ఆరా తీస్తున్నారు అని అంటున్నారు. ఇవే కాదు ఏపీలో గత ప్రభుత్వంలో చోటు చేసుకున్న భూకబ్జాల మీద కూడా విచారణ సాగుతోంది. ప్రత్యేకించి విశాఖలో భూకబ్జాలు మీద ఫుల్ ఫోసస్ పెడుతున్నారని అంటున్నారు. ఇక్కడ కూడా కీలక ఆధారాలు లభ్యమైతే పెద్ద నాయకులనే టార్గెట్ చేస్తారు అని అంటున్నారు.
ఇవన్నీ కాదు జగన్ మీద అనేక కేసులు పెట్టడంతో పాటు ఆయనను అన్ని విధాలుగా ఉక్కిరిబిక్కిరి చేయాలని కూటమి పెద్దలు ఆలోచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు. అంటే జగన్ జైలుకి ఒకసారి వెళ్తే వెనక్కి రాకుండా ఎక్కువ రోజులు వీలైనన్ని సార్లు ఉంచాలన్నది కూడా ఉంది అని అంటున్నారు. మరో వైపు చూస్తే జగన్ కి ఈ సంగతులు తెలుసా అన్నట్లుగా వైసీపీలో చర్చ సాగుతోంది ఆయన కూడా తన పార్టీ బాధ్యతలను జిల్లా అధ్యక్షులకు పీఏసీ సభ్యులకు అప్పగించారు అని గుర్తు చేస్తున్నారు. వారినే ముందు పెట్టి పార్టీ కోసం పనిచేయమని కోరుతున్నారు. రేపటి రోజున తాను ఏ విధమైన ఇబ్బందులలో ఉన్నా కూడా ఎవరికి వారే స్వతంత్ర్యంగా పార్టీ పని చేస్తూ ముందుకు సాగేలా పార్టీకి ఆయన దిశా నిర్దేశం చేస్తున్నారు
ఇవన్నీ చూస్తూంటే ఏపీలో ఏదో జరిగేలా ఉందని అంటున్నారు. జగన్ అరెస్ట్ అన్నది 2012 మే నేలలో జరిగింది. ఇపుడు నడుస్తోంది కూడా మే నెలనే. పైగా 13 ఏళ్ళ కాలం ఈ మధ్యలో గడచిపోయింది. మరి ఇపుడు జగన్ ని అరెస్ట్ చేయాలీ అంటే చాలా ఆధారాలు కావాలి. ఆయన మాజీ సీఎం గా ఉన్నారు. దాంతో ఆయన అరెస్ట్ అయినా సానుభూతి రాకుండా ఉండాలి అదే సమయంలో రెండేళ్ళకు పైగా జైలు శిక్ష పడితే ఆయనకు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు లేకుండా ఉంటుందని అన్న కోణంలో ఆలోచిస్తున్నారుట. మొత్తానికి చూస్తే కనుక జగన్ అరెస్ట్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందా అన్నదే అంతటా చర్చగా ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.