‘పది’ లో మెరిసిన ‘ఇండియన్ స్కూల్’ విద్యార్థులు

Warangal Bureau
1 Min Read

వరంగల్ సిటీ, మే 01 (ప్రజాజ్యోతి)

పదవ తరగతి (ఎస్.ఎస్.సీ) పరీక్షా ఫలితాల్లో నగరంలోని పుప్పాలగుట్ట, చింతల్ బ్రిడ్జి వద్దగల ఇండియన్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ చాటారు. వందకు వందశాతం ఉత్తీర్ణతతో మెరిసారు. అయేషా సనోబర్ 582, ఎస్ జస్వంత్ 569, న్యాల విష్ణు 565, డి కార్తీక్ 564, ఫాతిమా నిక్కత్ 562, ఎం జశ్వంత్ 562, సయిదా మీస్భకౌనైన 560, బి నందిత 560, సయ్యద్ మోహియుద్దీన్ ఉసయిని 558, జీ వర్షిని 551, అలాగే 500 కు పైగా మార్కులు 13 మంది విద్యార్థులు సాధించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ అండ్ చైర్మన్ గోవిందరాజులు మాట్లాడుతూ.. విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ వాటిని అందిపుచ్చుకుంటూ ఒత్తిడి లేని వాతావరణంలో క్రమశిక్షణ, సృజనాత్మకతతో కూడిన విద్యను అందిస్తున్నామని అన్నారు. తమ విద్యాసంస్థలో మెడికల్, ఐఐటి ఫౌండేషన్ లో ఎక్కువ శ్రద్ధతో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. విద్యార్థులను అన్ని పోటీ పరీక్షలకు సిద్ధం చేయడానికి బృహత్తరమైన పద్ధతిలో విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. ఈ అఖండ విజయాన్ని సాధించిన విద్యార్థులను ప్రోత్సహించిన తల్లిదండ్రులకు, అధ్యాపక బృందానికి అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *