కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

V. Sai Krishna Reddy
1 Min Read

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్డీయే సర్కారు శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 2 శాతం పెంచుతున్నట్టు నేడు వెల్లడించింది. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశమైంది. ఉద్యోగులకు డీఏ పెంచుతూ ఈ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తాజా పెంపుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 53 శాతం నుంచి 55 శాతానికి పెరిగింది.

అటు, రూ.22,919 కోట్లతో పీఎల్ఐ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా దేశీయ ఎలక్ట్రానిక్స్ రంగానికి ఊతం లభించనుంది. ముఖ్యంగా నాన్ సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్ పరిశ్రమలకు చేయూతనివ్వడమే ఈ కొత్త పథకం ముఖ్య ఉద్దేశం.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *