గ్రూప్-2 మెయిన్స్ ప్రాథమిక కీ విడుదల

V. Sai Krishna Reddy
1 Min Read

ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్ – 2 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. పేపర్ -1 పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ‘కీ’ని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్‌సీ) ఆదివారం సాయంత్రం విడుదల చేసింది. ప్రాథమిక ‘కీ’ పై అభ్యంతరాలు ఉంటే psc. ap.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ నెల 25 నుంచి 27వ తేదీ లోపు తెలపాలని ఏపీపీఎస్‌సీ సూచించింది.

ఆదివారం నిర్వహించిన గ్రూప్ – 2 మెయిన్స్ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న 92,250 మంది అభ్యర్థుల్లో 86,459 మంది హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోగా, హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకున్న వారిలో 92 శాతం మంది హాజరయ్యారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *