ఈసారి అక్షయ తృతీయకు రూ.లక్ష షాక్?

V. Sai Krishna Reddy
1 Min Read

గత ఏడాది అక్షయ తృతీయ రోజున పది గ్రాముల మేలిమి బంగారం ధర రూ.73,500 ఉంటే.. ఈసారి అది కాస్తా ఏకంగా రూ.99,800కు పెరిగింది. అంటే.. కాస్త చిల్లర్ని పక్కన పెడితే పది గ్రాముల బంగారం రూ.లక్ష చేరింది. ఇలాంటివేళ.. అమ్మకాలు ఎలా ఉంటాయి? అన్నది ప్రశ్నగా మారింది. సాధారణంగా అక్షయ తృతీయ రోజున కచ్ఛితంగా బంగారాన్ని కొనే వర్గం భారీగా ఉంటుంది. అయితే.. ఈసారి భారీగా పెరిగిన ధర ప్రభావం అమ్మకాల మీద ఖాయంగా ఉంటుందని చెబుతున్నారు.

గతంలో మాదిరి బంగారు దుకాణాల్లో హడావుడి కనిపించే అవకాశం ఉండదంటున్నారు. ఒకవేళ కొనుగోలుకు షాపులకు వచ్చినా.. గ్రాము.. రెండు గ్రాముల బంగారం కొనేందుకే ఆసక్తి చూపుతారన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. వ్యాపార వర్గాల అంచనా ప్రకారం దేశ వ్యాప్తంగా ఈ అక్షయ తృతీయకు రూ.16వేల కోట్ల మేర వ్యాపారం జరుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ మంచిరోజున గతంలో బంగారం కొనే వారు.. ఈసారి అందుకు భిన్నంగా ఆస్తులు కానీ.. ఎలక్ట్ట్రానిక్ వస్తువులు కానీ కొనుగోలు చేసే వీలుందని చెబుతున్నారు. బంగారు పరిశ్రమ వర్గాల అంచనా ప్రకారం ఈ రోజున 12 టన్నులు (టన్ను అంటే వెయ్యి కేజీల) బంగారం అమ్ముడయ్యే అవకాశం ఉందంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *