భాగ్యనగరంలో ప్రశాంతంగా సాగిన హనుమాన్ శోభాయాత్ర

V. Sai Krishna Reddy
0 Min Read

భాగ్యనగరంలో హనుమాన్ శోభాయాత్ర ప్రశాంతంగా కొనసాగింది. గౌలిగూడ శ్రీరామ ఆలయం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర కోఠి, నారాయణగూడ క్రాస్ రోడ్డు, చిక్కడపల్లి, సికింద్రాబాద్ మీదుగా తాడ్‌బండ్ హనుమాన్ దేవాలయానికి చేరుకుంది. సుమారు 12 కిలోమీటర్ల మేర సాగిన ఈ శోభాయాత్రలో వేలాదిమంది భక్తులు పాల్గొన్నారు.

అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నగర పోలీసులు 17 వేల మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా నిఘా ఉంచారు. ఇదిలా ఉండగా, హనుమాన్ శోభాయాత్ర ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో కొనసాగుతుండగా ముస్లిం సోదరులు స్వాగతం పలికారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *