పదోన్నతులు పోలీసులకు మరింత బాధ్యతను పెంచుతాయి

Kamareddy
1 Min Read

పదోన్నతులు పోలీసులకు మరింత బాధ్యతను పెంచుతాయి

—  జిల్లా ఎస్పీ ఎం రాజేష్ చంద్ర ఐపీఎస్

* పదోన్నతులు జీవన శైలిని  మార్చే విధంగా ఉత్సాహాన్ని కలిగిస్తాయి

* నిజాయితీగా ప్రజలకు సేవలు అందించాలి.

* జిల్లా ఎస్పీ శ్రీ యం.రాజేష్ చంద్ర ఐపిఎస్

ఏఎస్సై నుండి ఎస్సైలుగా  పదోన్నతి పొందిన (11) పోలీసులను అభినందించి పదోన్నతి చిహ్నాన్ని అలంకరించిన ఎస్పీ.
పోలీసు వ్యవస్థలో నిరంతరంగా సేవలందించి ఈరోజు పదోన్నతి పొందుతున్న రామారెడ్డి  పోలీస్టేషన్ ఏఎస్సై యన్. లచ్చీరామ్, ఎల్లారెడ్డి పోలీస్టేషన్ ఏఎస్సై, ఎండి,సిద్దికె,  భిక్నూర్ పోలీస్టేషన్ ఏఎస్సై, ఏ. మల్లారెడ్డి, పెద్దకొడపగల్ పోలీస్టేషన్ ఏఎస్సై, రాములు, మాచారెడ్డి  పోలీస్టేషన్ ఏఎస్సై, బి. నార్సింలు, గాంధారి  పోలీస్టేషన్ ఏఎస్సై, పి. గణేష్,  పిట్లం పోలీస్టేషన్ ఏఎస్సై, యల్. లింబద్రి , నాగిరెడ్డిపేట్ పోలీస్టేషన్ ఏఎస్సై, ఉమేష్,  దోమకొండ  పోలీస్టేషన్ ఏఎస్సై, సుబ్రమణ్య చారి, తాడ్వాయి పోలీస్టేషన్ ఏఎస్సై, సంజీవ్, హన్మగౌడ్ (ఇంటలిజెన్స్ లో ప్రస్తుతం) లు ఎస్సైలుగా, పదోన్నతి పొందిన పోలీసులు గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపీఎస్ ని మర్యాద
పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. పదోన్నతి పోలీసులకు ఎస్పీ చిహ్నాలను అలంకరించి శుభాకాంక్షలు తెలియజేసి  అభినందించారు.
ఈ సందర్భంగా

* ఎస్పీ మాట్లాడుతూ….!

పోలీసుశాఖలో పదోన్నత్తులు మరింత బాధ్యతను పెంచుతాయని అన్నారు, పదోన్నతులు పొందిన పోలీస్ సిబ్బంది రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు సేవలు అందించాలని కోరారు.పోలీసు శాఖలో క్రమశిక్షణతో బాధ్యతగా విధుల పట్ల నిబద్ధతతో వ్యవహరించే ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు, గౌరవ మర్యాదలు లభిస్తాయని ఆయన తెలియజేశారు.
ఈ కార్యాక్రమంలో డిఎస్పీలు మదన్లాల్, యాకుబ్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ తిరుపతయ్య, రిజర్వు ఇన్స్ పెక్టర్లు సంతోష్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *