శ్రీవారి వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌న వేళ‌లు మార్పు

V. Sai Krishna Reddy
1 Min Read

తిరుమ‌ల వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌న వేళ‌ల్లో మార్పు నేటి నుంచి అమ‌లు కానుంది. ఇవాళ్టి నుంచి ప్ర‌యోగాత్మ‌కంగా వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌న వేళ‌ల్లో మార్పులు చేస్తున్న‌ట్లు డిప్యూటీ ఈఓ లోక‌నాథం వెల్ల‌డించారు. ఈ మేర‌కు ఆయ‌న ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఉద‌యం 5.45 గంట‌ల నుంచి 11 గంట‌ల వ‌రకు ప్ర‌యోగాత్మ‌కంగా వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాల‌ను అమ‌లు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. కాగా, గురువారం శ్రీవారి తిరుప్పావ‌డ సేవ‌, శుక్ర‌వారం అభిషేక సేవ నేప‌థ్యంలో ఆ రెండు రోజులు పాత వేళ‌లే కొన‌సాగుతాయ‌ని ప్ర‌క‌టించారు.

ప్రొటోకాల్‌, రిఫరెల్‌, జనరల్‌ బ్రేక్‌ దర్శనాలను 7.30లోపు పూర్తి చే సి.. ఆ తర్వాత వీలైనంత మంది సామాన్య భక్తులకు దర్శనం కల్పించేలా టీటీడీ ప్ర‌ణాళిక రచించింది. ఉదయం 5.45: ప్రొటోకాల్‌ దర్శనం, 6.30: రిఫరెల్‌ ప్రొటోకాల్‌, 6.45: జనరల్‌ బ్రేక్‌, 10.15: శ్రీవాణి(ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌), 10.30: దాతలు, 11.00: టీటీడీ రిటైర్డ్‌ ఉద్యోగులు.. గురు, శుక్రవారాల్లో ఉదయం 8 గంటలకు బ్రేక్‌ దర్శనాలు ప్రారంభమవుతాయి. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ సూచించింది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *