స్కూలు నుంచి ఆలస్యంగా వచ్చాడని తండ్రి పిడిగుద్దులు.. కొడుకు మృతి

V. Sai Krishna Reddy
1 Min Read

మద్యం మత్తులో ఓ తండ్రి విచక్షణ మరిచాడు.. కన్న కొడుకును తీవ్రంగా కొట్టాడు. దెబ్బలకు తాళలేక ఆ బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఆసుపత్రికి తరలించేలోపే బాలుడి ఊపిరి ఆగిపోయింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో శనివారం రాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ విషయం పోలీసులకు తెలిస్తే తండ్రి జైలుపాలవుతాడనే ఉద్దేశంతో కుటుంబ సభ్యులు హడావుడిగా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. చివరి నిమిషంలో పోలీసులు శ్మశానానికి వెళ్లి అంత్యక్రియలను అడ్డుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్‌ మండలం ఆరేగూడేనికి చెందిన కట్ట సైదులు లారీ డ్రైవర్‌.. అతనికి భార్య నాగమణి, ముగ్గురు కుమారులు ఉన్నారు. మూడో కుమారుడు భానుప్రసాద్‌ (14) స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ స్కూలులో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. శనివారం స్కూలులో పదో తరగతి విద్యార్థులకు సెండఫ్ పార్టీ నిర్వహించారు. దీంతో భానుప్రసాద్ ఆలస్యంగా రాత్రి 8 గంటలకు ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే ఇంటికి వచ్చిన సైదులు కొడుకు ఇంకా ఇంటికి రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. భానుప్రసాద్ ఇంటికి వెళ్లగానే స్కూలు నుంచి ఇప్పుడా ఇంటికి రావడమంటూ కొట్టడం మొదలు పెట్టాడు. మద్యం మత్తులో విచక్షణ మరచి ఛాతీ, ఇతర భాగాలపై తీవ్రంగా కొట్టడంతో భానుప్రసాద్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *