జిల్లా పరిషత్ పాఠశాలలో మిషన్ పరివర్తన కార్యక్రమం

Nalgonda Bureau
1 Min Read

జిల్లా పరిషత్ పాఠశాలలో మిషన్ పరివర్తన కార్యక్రమం

విద్యార్థులకు మాదకద్రవ్యాల పై అవగాహనచి

 

చిట్యాల జూన్ 24(ప్రజా జ్యోతి); మాదకద్రవ్యాలు వాడకం వలన నేర ప్రవృత్తి పెరిగే అవకాశం ఉందని చిట్యాల ఎస్సై అమ్రిన్ నసీహ అన్నారు. మాదకద్రవ్యాల రహిత జిల్లాగా మార్చేందుకు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు చిట్యాల పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం నాడు విద్యార్థిని విద్యార్థులతో మిషన్ పరివర్తన పేరిట అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ఎస్ఐ హాజరై మాట్లాడుతూ మాదకద్రవ్యాలు వాడడం వల్ల ఎన్నో దుష్ప్రభావాలు లోన్ అవుతారని అన్నారు. ముఖ్యంగా మారకద్రవ్యాల పట్ల విద్యార్థులు ఎంతో జాగ్రత్తగా ఉండాలని వీటి వలన అనేక రకమైన మానసిక శారీరకపరమైనటువంటి అనారోగ్య సమస్యలు ఏర్పడి ప్రాణహాని కూడా జరిగే అవకాశం ఉందని అన్నారు. ప్రభుత్వం మాదకద్రవ్యాల విషయంలో చాలా కఠినంగా వ్యవహరించేలా చర్యలు తీసుకుంటుందని ఎవరైనా మానక ద్రవ్యాలు కలిగి ఉంటే వెంటనే పోలీస్ కు తెలియజేయాలి అని సూచించారు అనంతరము పాఠశాల ప్రధానోపాధ్యాయులు భోగి కార్ మాధవి మాదకద్రవ్యాల రహిత సమాజం కోసం పాఠశాల విద్యార్థిని విద్యార్థుల చేత ప్రతిని చేయించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ వెంకన్న ఉపాధ్యాయులు చిలక రాజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *