బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. మనం కనీవినీ ఎరుగని రీతిలో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి కొత్త రికార్డులు సృష్టిస్తోంది. గత ఏడాదికాలంలో గోల్డ్ ధర 38 శాతం పెరిగినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి బులియన్ మార్కెట్లో పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం.. బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతుంటాయి.. తాజాగా గోల్డ్ ధర స్వల్పంగా పెరగగా.. సిల్వర్ ధర భారీగా పెరిగి లక్షమార్కును దాటింది.. గురువారం (13 మార్చి 2025) ఉదయం ఆరు గంటల వరకు పలు వెబ్సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.80,660, 24 క్యారెట్ల పదిగ్రాముల గోల్డ్ ధర రూ.87,990 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,00,100 గా ఉంది. కాగా.. దేశీయంగా బంగారం 10 గ్రాములపై రూ.10, వెండి కిలోపై రూ.100 మేర ధర తగ్గింది. అయితే.. ఈ ధరలు ప్రాంతాల ప్రకారం మారుతుంటాయి