బయోడీజిల్ బంక్‌లో అగ్నిప్రమాదం .. ఒకరు మృతి

V. Sai Krishna Reddy
1 Min Read

పల్నాడు జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. రెంటచింతల మండలంలో గల ఓ బయోడీజిల్ బంక్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ట్యాంకర్ పేలి మంటలు ఎగిసిపడటంతో ఒకరు సజీవదహనమయ్యారు, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

 

రెంటచింతలలోని బయోడీజిల్ బంక్‌లో ట్యాంకర్ నుండి డీజిల్‌ను అన్‌లోడ్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు ట్యాంకర్‌కు వ్యాపించడంతో పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఈ దుర్ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని గురజాలకు చెందిన రషీద్‌గా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *