ఎల్లారెడ్డి, జూన్ 21 (ప్రజా జ్యోతి )
ఎల్లారెడ్డి ఇన్చార్జి ఎఫ్ఆర్ఓగా చరణ్ తేజ శనివారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం కామారెడ్డి మొబైల్ పార్టీ ఎఫ్ఆర్ఓగా పని చేస్తున్న చరణ్ తేజ ఎల్లారెడ్డి ఎఫ్ ఆర్ఓ ఓంకార్ ను సస్పెండ్ చేయడంతో ఈయన స్థానానికి జిల్లా అటవీశాఖ ఉన్నతధికారుల ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి రేంజ్ అటవీశాఖ అధికారిగా ఇన్చార్జిగా అదనపు బాధ్యతలు అప్పగించినాట్లు వారు తెలిపారు.బాధ్యతలు తీసుకున్న చరణ్ తేజ ఎల్లారెడ్డి రేంజ్ పరిధిలోని అధికారులు, సిబ్బందితో పట్టణంలోని అటవీ శాఖ కార్యాలయంలో రివ్యూ సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడు..అటవీ భూముల పరిరక్షణకు కృషి చేస్తానని అన్నారు.