భూ భారతి చట్టంతో భూ సమస్యలన్నీ పరిష్కారం

Nalgonda Bureau
3 Min Read

భూ భారతి చట్టంతో భూ సమస్యలన్నీ పరిష్కారం

 

భూభారతి చట్టం పేదల చుట్టం

 

వ్యక్తికి ఆధార్ భూమికి భూధార్

ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

 

బొమ్మలరామారం ఏప్రిల్ 21 (ప్రజాజ్యోతి)

భూభారతి చట్టంతో రాష్ట్రంలో ఉన్న భూ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. సోమవారం మండల తహసిల్దార్ కార్యాలయ ప్రాంగణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టం పై రైతులతో జరిగిన అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి భూభారతి చట్టం పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ భూ భారతి చట్టం భూ వివాదాల శాశ్వత పరిష్కారం కోసమే ప్రభుత్వం తీసుకువచ్చిందని రాష్ట్రంలో ఉన్న భూమి సమస్యలన్నీ తీరుతాయని అన్నారు. ధరణి పోర్టల్ ద్వారా రాష్ట్రంలో అనేక మంది రైతులు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ప్రతి రైతు ఆనందంగా జీవించాలని భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చినట్లు తెలిపారు. భూ భారతి చట్టం రైతులకు చుట్టంలాంటిదని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం కల్పించిన ఒక వరమని ఒక వ్యక్తి వివరాలను తెలుపుటకు ఆధార్ ఎలాగ ఉంటుందో అలాగే ప్రతి భూమి వివరాలను తెలుపుటకు భూమికి భూధార్ ఉంటుందని తెలిపారు. భూమి రికార్డులను మోసపూరితంగా మార్చి ప్రభుత్వ భూదాన్, అసైన్డ్, దేవాదాయ భూములను ఎవరైనా పట్టా చేసుకుంటే వాటిని రద్దు చేసేలా సిసిఎల్ఏ కి అధికారాలు ఉంటాయని ఆయన చెప్పారు. భూ భారతి చట్టంలో అప్పీలు వ్యవస్థ తెచ్చామని ఎవరి భూమి అయినా వేరే వాళ్లకు తప్పుగా నమోదైతే ఎమ్మార్వో, ఆర్డీవో, జాయింట్ కలెక్టర్ కు అపిల్ చేసుకొని పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ప్రస్తుతం మండల స్థాయిలో అవగాహన సదస్సు నిర్వహించామని ఈ అవగాహన సదస్సు ప్రతి గ్రామంలో గ్రామ సభ ద్వారా ప్రజలందరికీ కల్పిస్తామని ప్రతి గ్రామానికి గ్రామ పరిపాలన అధికారిని నియమించడంతో రైతులకు అన్ని సేవలు గ్రామంలో అందుతాయని రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసి రైతులకు ప్రజలకు అన్ని సేవలను అందిస్తామని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, జాయింట్ కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీవో కృష్ణారెడ్డి, స్థానిక తహసిల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీవో రాజా త్రివిక్రమం, ఆర్ఐ వెంకట్ రెడ్డి,నరేష్,కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సంజీవరెడ్డి, మదర్ డైరీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, పీసీసీ కోఆర్డినేటర్ సంధ్యారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పావని, భువనగిరి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బైసు రాజేష్,కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు సింగిర్తి మల్లేశం, సింగిల్ విండో చైర్మన్ గూదే బాల్ నరసింహ, వైస్ చైర్మన్ కొండల్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు దేశెట్టి చంద్రశేఖర్, నియోజకవర్గ యువజన అధ్యక్షుడు నందరాజు గౌడ్, మాజీ జెడ్పిటిసి సభ్యులు చీర్ల రాజేశ్వర్ యాదవ్, మాజీ ఎంపిటిసి దీరావత్ శ్రీహరి నాయక్, మందల రామస్వామి వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీరాములు నాయక్, కాంగ్రెస్ మండల పార్టీ మహిళా అధ్యక్షురాలు సునీత రవీందర్ నాయక్,బీర్ల యువసేన అధ్యక్షులు జూపల్లి శ్రీకాంత్,భువనగిరి మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ రామిరెడ్డి, ఆదివాసి గిరిజన సెక్రెటరీ రాజు నాయక్ అధికారులు కాంగ్రెస్ పార్టీ జిల్లా మండల నాయకులు పాల్గొన్నారు అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *