పన్నెండేళ్ల క్రితం దిల్సుఖ్నగర్లో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో రేపు తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించనుంది. 2013లో దిల్సుఖ్నగర్లో జరిగిన వరుస పేలుళ్లలో 18 మంది మృతి చెందగా, 130 మందికి పైగా గాయపడ్డారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు యాసిన్ భత్కల్ సహా ఐదుగురికి 2016లో ఎన్ఐఏ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉరిశిక్ష విధించింది.
దీనిపై ముద్దాయిలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన తెలంగాణ అత్యున్నత న్యాయస్థానం మంగళవారం (ఏప్రిల్ 8) తీర్పు వెలువరించనుంది. ఈ కేసులో నిందితుడు భత్కల్ ఇప్పటికీ పరారీలోనే ఉన్నాడు.