మూడో వంతు ఉక్రెయిన్ భూమి రష్యాకు పోయినట్లే.. శాంతి కావాలంటే అంతే

V. Sai Krishna Reddy
1 Min Read

11 ఏళ్ల కిందటే ఉక్రెయిన్ మీద దాడి చేసి దానికి చెందిన అత్యంత కీలకమైన క్రిమియా ద్వీపకల్పాన్ని ఆక్రమించేసింది రష్యా.. ఇది జరిగింది 2014లో. ఆ తర్వాత 2022లో డైరెక్ట్ గా ఉక్రెయిన్ రాజధాని కీవ్ మీదనే అటాక్ మొదలుపెట్టింది. అనేక ప్రాంతాల్లోకి చొచ్చుకొచ్చింది. ఇందులో ముఖ్యమైనది డాన్ బాస్ (డొనెట్స్క్, లుగాన్స్క్). పారిశ్రామికంగా కీలకమైన డాన్ బాస్.. క్రిమియాకు కూడా సమీపం. ఈ ప్రాంతం అంతా ఇప్పుడు రష్యా ఆధీనమే. ఇక్కడ రెండేళ్ల కిందట ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇటు నల్ల సముద్రం తీరాన ఉన్న ఒడెసా వరకు రష్యా చేతులో ఉన్నట్లే

సరిగ్గా యుద్ధం మొదలై మూడేళ్లు. ఇప్పుడు చూసుకుంటే ఉక్రెయిన్ దాదాపు మూడో వంతు భూభాగాన్ని రష్యాకు కోల్పయింది. ఇప్పటికే క్రిమియాను కలిపేసుకున్న రష్యా నుంచి మిగతా భూమి కూడా తిరిగి రావడం కష్టమే. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ పై కారాలు మిరియాలు నూరుతున్నారు. పూర్తిగా రష్యా పక్షం వహిస్తూ ఉక్రెయిన్ ను కార్నర్ చేస్తున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని శత్రువులా చూస్తున్నారు. కీలకమైన ఖనిజాల తవ్వకానికి ఒప్పందం కుదరకపోవడంతో ఉక్రెయిన్ సైనిక, ఆర్థిక సాయం ఆపేశారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *