కేటీఆర్ ట్వీట్స్ పార్టీకి నష్టం చేస్తున్నాయా ?

V. Sai Krishna Reddy
1 Min Read

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి అయిన కేటీఆర్ ప్రతీ విషయం మీద ట్వీట్లు పెడుతూంటారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి అయిన కేటీఆర్ ప్రతీ విషయం మీద ట్వీట్లు పెడుతూంటారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆ విధంగా ఎండగడుతూంటారు. ఎక్కడ ఏ సంఘటన జరిగినా ప్రభుత్వానికి సంబంధం చూపుతూ ఆయన ట్వీట్లు వేస్తారు. దీని వల్ల జనంలో చర్చ సాగాలని సర్కార్ బదనాం కావాలన్న ఎత్తుగడలతోనే ఇదంతా చేస్తున్నారు.

రాజకీయాల్లో ఇది ఒక విధానంగా ఉన్నా కేటీఆర్ ఉన్న పార్టీ బీఆర్ఎస్ పదేళ్ళ పాటు తెలంగాణాను ఏలిన పార్టీ. కేటీఆర్ కూడా మంత్రిగా పదేళ్ళ పాటు పనిచేశారు. మరి సమస్యలు ఎపుడూ ఉంటూనే ఉంటాయి. ఒక సమస్యను విపక్షంగా వీరు చెబితే మీ హయాంలో పది సమస్యలు చెప్పమంటారా అని అధికార కాంగ్రెస్ నేతలు రివర్స్ లో ఎటాక్ చేస్తూంటారు. అది వారి రాజకీయ వ్యూహం.

దీంతో ఒక ఇష్యూతో కాంగ్రెస్ ని కార్నర్ చేయబోయి మరిన్ని ఇష్యూస్ తో కేటీఆర్ చిక్కుకుంటున్నారా అన్న చర్చ అయితే వస్తోంది. ఇవే కాదు రాజకీయంగా కూడా కేటీఅర్ వేసే ట్వీట్లు కూడా ఎదురు తంతున్నాయని బీఆర్ఎస్ ని బూమరాంగ్ చేస్తున్నాయని అంటున్నారు. ఉదాహరణకు చూస్తే కనుక ఢిల్లీలో కాంగ్రెస్ ఓటమి పాలు అయింది. రాహుల్ గాంధీ మీద కేటీఆర్ ఈ సందర్భంగా పెట్టిన ట్వీట్ అయితే అభాసుపాలు అయింది అని అంటున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *