తాళం వేసిన ఇంట్లో దొంగతనం
— ఎస్ఐ పి. రాజశేఖర్
రామారెడ్డి ఏప్రిల్ 03 (ప్రజా జ్యోతి)
రామారెడ్డి మండల కేంద్రంలోని మద్దికుంట గ్రామంలో ఓరుగంటి రాజు (40) వృత్తి ఆర్టిజిఎన్, ఉదయం తన విధులకు వెళ్ళగా వారి కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి ఉగ్రవై మైసమ్మ గుడికి వెళ్లి తిరిగి సాయంత్రం 6 గంటలకు ఇంటికి వచ్చి చూడగా ఇంటికి వేసిన తాళం లేదు, ఇంటి లోపలికి వెళ్లి చూడగా ఇంటి బీరువా లాకర్ పగలగొట్టి అందులో గల మూడున్నర తులాల బంగారం, వెండి 15 తులాలు, మరికొంత నగదు ఎవరో గుర్తుతెలియని దొంగలు దొంగతనం జరిగిందని ఇట్టి విషయంపై ఫిర్యాదు రాగా స్థానిక ఎస్సై పి.రాజశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
