కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

Kamareddy
1 Min Read

కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

ఎమ్మెల్యే మదన్మోహన్ రావు

రామారెడ్డి అక్టోబర్ 06 (ప్రజా జ్యోతి)

ఎల్లారెడ్డి నియోజకవర్గం రామారెడ్డి మండల బీఆర్‌ఎస్ మండల ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, పిఎసిఎస్ సొసైటీ డైరెక్టర్ రాజేందర్, గిద్ద గ్రామానికి చెందిన మాజీ వార్డ్ మెంబర్ లు నర్సవ్వ, రాజవ్వ, రమేష్ రెడ్డి, సీనియర్ నాయకులు లింబ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తో పాటు 30 మంది నాయకులు బీఆర్‌ఎస్ పార్టీని వీడి, ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే మదన్ మోహన్ నాయకత్వంలో రామారెడ్డి మండలంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చూసి ఆకర్షితులమయ్యాం. ప్రజల కోసం నిజమైన సేవ చేయడానికి కాంగ్రెస్ పార్టీలో చేరాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ప్రవీణ్ గౌడ్, రామారెడ్డి మాజీ సర్పంచ్ రంగు రవీందర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రవుఫ్, మండల ఉపాధ్యక్షులు, మండల కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ, మండల బీసీ సెల్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు అరవింద్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *