తెలంగాణ ప్రజా ప్రభుత్వంలో వ్యవసాయం దండుగ కాదు…….పండగ
రైతు భరోసా విజయోత్సవ సంబరాల్లో చేసుకున్న అనంతగిరి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు
అనంతగిరి, జూన్ 24( ప్రజా జ్యోతి): అనంతగిరి మండల కేంద్రంలో మంగళవారం రోజున మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముస్కు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు విజయోత్సవ సంబరాలు కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొనడం జరిగింది.9 రోజుల్లో 9 వేల కోట్ల రూపాయలు రైతు భరోసా కింద నిధులు రైతుల ఖాతాలో విడుదల చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని మండలంలోని రైతులు మరియు పార్టీ నాయకులు ఏఐసీసీ అధ్యక్షులు మల్లి కార్జున్ ఖర్గే, సోనియాగాంధీ గాంధీ, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు కోదాడ శాసన సభ్యురాలు పద్మావతి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం రైతులందరు ప్రజా ప్రభుత్వం పట్ల హర్షం వ్యక్తంచేశారు, ఈ సందర్భంగా అనంతగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముస్కు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కేవలం18 నేలలో రైతు రుణమాఫీ,రైతు భరోసా,రైతు బోనస్లు అందించిన ఏకైక ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం అని వారు వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చుండూరి వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు డేగా కొండయ్య, అనంతగిరి మాజీ ఎంపిటిసి ఈదుల కృష్ణయ్య, గొండ్రియల మాజీ పిఎసిఎస్ చైర్మన్ బుర్ర నరసింహారెడ్డి, మండల కార్యదర్శి గద్దె రామారావు, పాలవరం గ్రామ శాఖ రామకోటయ్య గౌడ్, కానాపురం గ్రామ శాఖ కనకాల వీరయ్య, ఎస్టీ సెల్ అధ్యక్షులు రాజీవ్ నాయక్, కొత్త గోల్ తండా గ్రామ శాఖ బానోతు వేణు, కత్రం నాగేందర్ రెడ్డి, మందపల్లి వెంకటేశ్వర్లు, భూక్య నారాయణ, సుక్య నాయక్, వెంకటేశ్వర్లు, హరిబాబు మరియు వివిధ హోదాలలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు.