పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించాలి
— జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
— పాఠశాలకు రంగులు వేయించిన సైంటిస్ట్ పైడి ఎల్లారెడ్డి
— వడ్లూరు ఎల్లారెడ్డి హరిజనవాడ లో బడిబాట
రామారెడ్డి జూన్ 12 (ప్రజా జ్యోతి)
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుంది కలెక్టర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ సదాశివ నగర్ మండలంలోని అడ్డూ అడ్లూరు ల్లారెడ్డి హరిజనవాడ ప్రాథమిక పాఠశాలలో సైంటిస్ట్ పైడి ఎల్లారెడ్డి తో కలిసి ప్రారంభించారు ముందుగా సరస్వతి విగ్రహానికి జ్యోతి ప్రజ్వలన చేసి ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు తల్లిదండ్రులు తమ పిల్లలను తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలన్నారు ప్రభుత్వం అందజేసిన దుస్తులను పుస్తకాలను పిల్లలకు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ప్రజలందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలన్నారు ప్రభుత్వ పాఠశాలలో అనుభవం గల ఉపాధ్యాయులు ఉన్నారని సౌకర్యాలు కల గదులు ఉన్నాయని చాలా గ్రామాలలో దాతల సహకారంతో ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు ఉపాధ్యాయుల కొరత లేకుండా చూసే బాధ్యత తమదేమన్నారు ఈ సందర్భంగా పాఠశాలకు రంగులు వేయించిన సైంటిస్ట్ పైడి ఎల్లారెడ్డిని అలాగే ఫర్నిచర్ అందజేసిన గాయత్రి షుగర్ యజమాన్యాన్ని అభినందించి శాలువాతో సన్మానించారు ఈ సందర్భంగా పాఠశాలలో మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో డీఈఓ రాజు ఎంఈఓ జోసెఫ్ సొసైటీ చైర్మన్ మరి సదాశివరెడ్డి వీడిసి చైర్మన్ ముధం సత్యం బిజెపి రాష్ట్ర నాయకుడు సంకర విఠల్ మండల ప్రధాన కార్యదర్శి చక్రధర్ గౌడ్ తాసిల్దార్ సత్యనారాయణ మండల ప్రత్యేక అధికారి సతీష్ యాదవ్ తాజా మాజీ సర్పంచ్ పైడి జానకి జనార్ధన్ మాజీ ఎంపిటిసి ఎడ్ల రేణుక నర్సింలు ఉపాధ్యాయులు గ్రామస్తులు విద్యార్థిని విద్యార్థులు అంగన్వాడి సిడిపివో శ్రీలత సూపర్వైజర్ పద్మ టీచర్లు ఐకెపి ఎపిఎం రాజిరెడ్డి సిసి అబ్బ లింగం సి ఎ లు తదితరులు గంపల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.