జిల్లాకు మంత్రి పదవి ఇవ్వకపోవడం విడ్డురం… బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి

Nizamabad Bureau Sanjeev Yedla

మంత్రి పదవి ఇవ్వడానికి ఇందూరు నేతలకు అర్హత లేదా.?

బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి

నిజామాబాద్, ప్రజాజ్యోతి, జూన్ 9 :

మంత్రి వర్గ విస్తరణలో నిజామాబాద్ జిల్లా కు అవకాశం ఇవ్వకపోవడంపై గౌరవం లేని చోట అభివృద్ధి ఉండదని, అందుకు ప్రజా గళం ప్రభుత్వానికి జవాబు చెప్పాల్సి ఉంటిందని బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ కూలాచారి అన్నారు. సోమవారం నిజామాబాద్ బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో .. మంత్రివర్గ విస్తరణలో నిజామాబాదు జిల్లాకు కనీసం ఒక్క మంత్రి పదవి కూడా కేటాయించకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇది సాదా విషయమేం కాదు, నిజామాబాదు జిల్లాకు చెందిన పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ సీనియర్ ఎమ్మెల్యే అయిన సుదర్శన్ రెడ్డిని కూడా గౌరవించని కాంగ్రెస్, తన పార్టీ నేతల పట్లే చులకన చూపుతోంది. కాంగ్రెస్ పార్టీకి జిల్లాల ప్రాతినిధ్యం పట్ల పట్టుదల లేదు. ఇది నైతికంగా, ప్రజాస్వామ్య పరంగా బాధాకరం. నిజామాబాదు సమస్యలు ఎవరికీ చెప్పుకోవాలి ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణ రావు సుడిగాలి పర్యటన తప్ప అభివృద్ధి మీద శ్రద్ద లేదు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి సరైన బుద్ది చెప్పాలి. రాష్టంలో బీసీలకు మేమే పెద్ద పీఠం అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో 56 %ఉన్నా బీసీ లకు మీ మంత్రి వర్గం లో ఎంత మందికి పదవులు ఇచ్చారో ప్రజలకు జవాబు చెప్పాలని అన్నారు. బీసీల ఓట్లు కావాలి, కానీ బీసీలకు పదువులు ఇవ్వరా.? అని అన్నారు. బీసీలను విస్మరించిన కాంగ్రెస్ ను రాబోయే రోజుల్లో బొంద పెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నిజామాబాదు జిల్లా నుంచి ఎంతో మంది మంత్రులాగా చేశారు. అలాంటి నిజామాబాదుకు ఒక్క మంత్రి పదవి ఇవ్వకపోవడం దారుణం, మేము ఎవరికి వత్తాసు పలకడం కాదు. కానీ ఈ తప్పిదాన్ని ప్రజలకు చూపించాల్సిన బాధ్యత మాపై ఉంది,” అని స్పష్టం చేశారు. నిజామాబాదు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు నత్త నడకన సాగుతున్నాయని, కేంద్రం నిధులు విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రాక అభివృద్ధి జరగడం లేదని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులో సరైన వసతులు లేవు. పేదలకు ఉచితంగా ఇళ్లను ఇవ్వాలన్న డబుల్ బెడ్ రూమ్ పథకం ఊసే లేదు. ఇందిరమ్మ ఇండ్లు కనపడటం లేదు, నిజామాబాదు జిల్లాకు నిధులు ఇవ్వకుండా, ప్రజలను దారుణంగా నిర్లక్ష్యం చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. జిల్లా కోసం పోరాటమే మార్గం “నిజామాబాదు జిల్లా కాంగ్రెస్ పార్టీ లెక్కల్లో ఉందో లేదో ప్రజలు విచారించాలి. అభివృద్ధికి నిధులు లేవు, ప్రాజెక్టులు నిలిచిపోయాయి,. మంత్రి పదవులు ఇవ్వరు – ఇది జిల్లా ప్రజల గౌరవాన్ని తాకట్టు పెట్టడమేనా. కేంద్ర ప్రభుత్వ పథకాలు మాత్రమే జిల్లాలో కదలిక తెస్తున్నాయి. బీజేపీ ఎప్పుడు ప్రజల పక్షాన నిలుస్తుంది. ఈ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడం మా లక్ష్యం” అని తెలిపారు.రాబోయే రోజుల్లో ఉద్యమాలు ఇలాంటి అసమానతలను తిప్పికొట్టేందుకు బీజేపీ ఉద్యమాలు చేపట్టబోతుందని, ప్రజలతో కలిసి రోడ్డెక్కి పోరాటం చేస్తామని అయన తెలపారు అభివృద్ధికి గళమెత్తాలని నిజామాబాదు దినేష్ గారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతనకార్ లక్ష్మి నారాయణ, న్యాలం రాజు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గోపిడి స్రవంతి రెడ్డి, ఉపాధ్యక్షలు నాగోల్ల లక్ష్మి నారాయణ, ఇంటలెక్చువల్ కన్వీనర్ డా:కొండా ఆశన్న, రూరల్ కన్వీనర్ పద్మ రెడ్డి, బీజేపీ జిల్లా నాయకులు నాగరాజ్,ఓం సింగ్, నాయిడి రాజన్న, యాదల నరేష్, అమందు విజయ్ కృష్ణ, చిరంజీవి, సందీప్, తదితరులు పాల్గొన్నారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *