కారు ఢీకొని ఇద్దరికీ తీవ్ర గాయాలు
* కామారెడ్డి జిల్లా ప్రతినిధి (నర్సింలు) మే 23
మాచారెడ్డి మండల కేంద్రం చౌరస్తాలోని ఉదయం 6:30 గంటల సమయంలో కారు వేములవాడ వెళుతున్న క్రమంలో చౌరస్తాలో ఆగి ఉన్న నాలుగు బైకులను ఢీకొని ఇద్దరికీ తీవ్ర గాయాలు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వారిని పోలీసులు వెంటనే అంబులెన్స్ లో ఏరియా ఆసుపత్రికి తరలించారు. సమాచారం ప్రకారం డ్రైవర్ అజాగ్రత్తగా నడపడం వల్లనే యాక్సిడెంట్ కు గురయ్యాని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.