సైబర్ నేరాలు,గంజాయి, డ్రగ్స్ నియంత్రణపై పోలీస్ కళాజాత
గరిడేపల్లి,మే 03(ప్రజా జ్యోతి):
ఎస్పీ కె నరసింహ ఐపిఎస్ ఆదేశాల మేరకు గరిడేపల్లి SI సలిగంటి నరేష్ ,PSI సురేష్ రెడ్డి మండల కేంద్రంలోనీ వెలిదండ గ్రామంలో సైబర్ నేరాలపైన,అన్ లైన్ బెట్టింగ్, గంజాయి,డ్రగ్స్ మత్తుమందులపై,రోడ్డు ప్రమాదాలపై పోలీసు కళాభృందంతో ప్రజలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ సందర్బంగా పిఎస్సై సురేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు పోలీసుకు మైత్రి కలిగి ఉండాలని పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమాన్ని గ్రామ పోలీసు వ్యవస్థను ఎస్పీ ఏర్పాటు చేశారన్నారు.రోడ్డు ప్రమాదాలు,డయల్ 100, బాల్య వివాహాలు,సిసి కెమేరాలు,గుట్క,గంజాయి డ్రగ్స్ వల్ల యువకులు వారి జీవితాలను నాశనం చేసుకోవద్దని,మూఢ నమ్మకాలు నమ్మొద్దని,తల్లి తండ్రులను మంచిగా చూసుకోవాలని,తదితర అంశాలపై పాటలు,సైబర్ క్రైమ్స్ కళాబృందం ద్వారా ప్రదర్శిస్తు1930 సైబర్ టోల్ నంబర్ గురించి ప్రజలు అవగాహన కలిగి ఉండాలన్నారు.ప్రజల రక్షణ భద్రత కోసమే పోలీస్ ఉందని, సమస్యాత్మక గ్రామంగా పోలీసు రికార్డులో ఒకసారి నమోదు అయితే పేరు ఎప్పటికీ అలాగే నిలిచిపోతుందన్నారు.ఏదో ఒకసారి కేసుల్లో చిక్కుకుంటే భవిష్యత్తులో ఉద్యోగాలు కోసం విదేశాలకు వెళ్లే సమయంలో పాస్పోర్ట్,వీసా పొందే విషయంలో పోలీస్ అనుమతి ఇవ్వబడుదన్నారు. మహిళలను పిల్లలను వేధిస్తే షీ టీం నెం. 8712686056 కి ఫిర్యాదు చేయాలన్నారు. పిడిఎస్ బియ్యంతో అక్రమ వ్యాపారం చేయవద్దని,శాస్త్ర సాంకేతిక రంగం అభివృద్ది చెందుతున్న కాలంలో మూఢనమ్మకాలు నమ్మ వద్దన్నారు.ఈ కార్యక్రమంలో కోదాడ షీటీం ASI కృష్ణమూర్తి,హెడ్ కానిస్టేబుల్ లక్ష్మి నర్సయ్య,షీటీం మహిళ హెడ్ కానిస్టేబుల్ కవిత,సాయి జ్యోతి, పోలీస్ కళాబృందం ఇన్చార్జి యల్లయ్య,గోపయ్య, చారి,గురులింగం,నాగార్జున, కృష్ణ,గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొన్నారు.