పదవ తరగతి ఫలితాల్లో డిస్నీల్యాండ్ విద్యార్థుల విజయ దుందుభి…

Warangal Bureau
1 Min Read

దామెర, ఏప్రిల్ 30 (ప్రజాజ్యోతి)::

హనుమకొండ జిల్లా దామెర మండలం ఒగ్లాపూర్ లోని డిస్నీల్యాండ్ హై స్కూల్ విద్యార్థులు పదవ తరగతి ఫలితాల్లో విజయ దుందుభి మోగించారు. వరుసగా 20వ సారి తమ సత్తా చాటి విజయ కేతనం ఎగురవేశారు. ఇందులో విద్యార్థులు తుత్తురు హర్షిని, బానోత్ శ్రీమాన్ లు 569 మార్కులతో అగ్రస్థానంలో నిలిచారు. అలాగే 500 ఆపై మార్కులు 47 మంది విద్యార్థులు సాధించారు.133 మంది విద్యార్థులకు గాను 130 మంది విద్యార్థులు ప్రధమ శ్రేణిలోనే ఉత్తీర్ణత సాధించడం ఎంతో గర్వకారణం అని యాజమాన్యం తెలిపారు. ఇంతటి అద్భుత విజయాలను సాధించిన విద్యార్థులను, బోధించిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను పాఠశాల వ్యవస్థాపకులు దయ్యాల మల్లయ్య, దయ్యాల సదయ్య, బాలుగు లక్ష్మి నివాసం, డైరెక్టర్స్ శోభారాణి,రాకేష్ భాను, దినేష్ చందర్ లు, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు శ్రేయోభిలాషులు అభినందించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *