కుప్వారాలో లష్కరే తోయిబా ఉగ్రవాది ఫరూక్ అహ్మద్ తీద్వా ఇల్లు బ్లాస్ట్
ప్రస్తుతం పాకిస్థాన్లో ఉంటూ పాక్ సైన్యంతో కలిసి పని చేస్తోన్న ఫరూఖ్
ఉగ్రవాదులకు, వారి కుటుంబాలకు గట్టి హెచ్చరిక
ఇప్పటివరకు మొత్తం ఆరుగురు ఉగ్రవాదుల ఇళ్ల నేలమట్టం
జమ్ముకశ్మీర్లోని పహల్గామ్ సమీపంలో జరిగిన ఉగ్రదాడిపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తోంది. లష్కరే తోయిబా ఉగ్రవాది ఫరూఖ్ అహ్మద్ తీద్వాకు చెందిన కుప్వారాలోని ఇంటిని అధికారులు పేల్చివేశారు. ఫరూఖ్ ప్రస్తుతం పాకిస్థాన్లో ఉన్నాడు. పాక్ సైన్యంతో కలిసి పని చేస్తున్నాడు. భారత అధికారులు ఇప్పటి వరకు ఆరుగురు ఉగ్రవాదుల ఇళ్లు పేల్చివేశారు. ఈ చర్య ఉగ్రవాదులకు, వారి కుటుంబాలకు కఠినమైన సందేశాన్ని పంపించినట్లు అవుతుంది.
జమ్ముకశ్మీర్లోని కుప్వారా జిల్లాలో భద్రతా బలగాలు ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతున్నాయి. తాజాగా, లష్కరే తోయిబా సంస్థకు చెందిన ఉగ్రవాది ఫరూక్ అహ్మద్ తీద్వా ఇంటిని అధికారులు పేల్చివేశారు. ప్రస్తుతం పాకిస్థాన్లో తలదాచుకుంటున్న ఈ ఉగ్రవాది ఆస్తులపై తీసుకున్న ఈ చర్య స్థానికంగా కలకలం రేపింది.
కుప్వారా నివాసి అయిన ఫరూక్ అహ్మద్ తీద్వా, నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాలో క్రియాశీలకంగా పనిచేస్తున్నాడు. భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతూ, పాకిస్థాన్లో ఆశ్రయం పొందుతున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకునే క్రమంలో భాగంగానే ఈ కూల్చివేత జరిగినట్లు తెలుస్తోంది.
ఈ చర్య ద్వారా, ఉగ్రవాద మార్గాన్ని ఎంచుకున్న స్థానికులకు, వారికి సహకరిస్తున్న వారి కుటుంబాలకు ప్రభుత్వం ఒక గట్టి హెచ్చరిక పంపినట్లయింది. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు తప్పవని చెప్పడమే ఈ చర్య ముఖ్య ఉద్దేశ్యంగా కనిపిస్తోంది