తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఏప్రిల్ 12 నుండి 14 వరకు ఉరుముల, మెరుపులు, తీవ్ర గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. హైదరాబాద్ విషయానికొస్తే, ఏప్రిల్ 16 వరకు నగరంలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని IMD తెలిపింది. వచ్చే బుధవారం వరకు ఉదయం వేళల్లో పొగమంచు పరిస్థితులు ఉంటాయని అంచనా వేసింది. కాగా శుక్రవారం హైదరాబాద్లోని ముషీరాబాద్లో అత్యధికంగా 39.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో అత్యధికంగా 43.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నిజామాబాద్లో రికార్డయింది. అంచనా వేసిన వాతావరణ పరిస్థితుల దృష్ట్యా, వాతావరణ శాఖ ఏప్రిల్ 14 వరకు తెలంగాణలోని వివిధ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. రెయిన్ అలెర్ట్ నేపథ్యంలో.. రాబోయే 2, 3 రోజులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయని భావిస్తున్నారు. అంటే 3 రోజులపాటూ.. చెదురు మదురుగా తెలంగాణలో వర్షాలు పడుతూనే ఉంటాయని అధికారులు తెలిపారు.