రైతు భరోసాపై రాష్ట్ర ప్రభుత్వం బిగ్ అప్డేట్ ఇచ్చింది. రైతు భరోసాపై రాష్ట్ర ప్రభుత్వం బిగ్ అప్డేట్ ఇచ్చింది. రైతులకు పెట్టుబడి సాయం కింద పంపిణీ చేసే ఈ పథకాన్ని ఇంతవరకూ నాలుగు విడతల్లో (పైలట్ ప్రొగ్రామ్తో సహా) 3 ఎకరాలు ఉన్న రైతులకు వర్తింపజేసింది. మరో వారంలో నాలుగు ఎకరాలున్న రైతులకు అందించేందుకు ప్లాన్చేస్తోంది. వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే జాబితాలను సిద్ధం చేస్తున్నారు. ఎకరానికి రూ.6 వేలు చొప్పన రైతుల ఖాతాలో జమ చేస్తారు. సాగు యోగ్యం కాని భూములను(రాష్ట్రంలో 1.20 లక్షల సర్వే నంబర్లు) బ్లాక్లిస్టులో పెట్టారు. వాటికి రైతు భరోసా నిలిపివేస్తామని వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే ప్రకటించారు.
1.48 కోట్ల ఎకరాలకు పెట్టుబడి సాయం
రాష్ట్రంలో 1.51 కోట్ల ఎకరాల భూమి ఉంది. అందులో వ్యవసాయానికి అనువుగాని భూమి 3 లక్షల ఎకరాలుగా అధికారులు నిర్ధారించారు. మిగతా 1.48 కోట్ల ఎకరాలకు పెట్టుబడి సాయం పంపిణీ చేయాలని నిర్ణయించారు. నాలుగు దఫాలుగా విడుదల చేసిన రైతు భరోసాను ఇప్పటివరకూ.. 44,82,265 మంది రైతుల ఖాతాలకు జమ చేశారు. 58.13 లక్షల ఎకరాల సాగు కోసం రూ.3487.82 కోట్లు విడుదల చేశారు. జనవరి 27న రాష్ట్ర ప్రభుత్వం మండలానికి ఒక గ్రామం చొప్పన 577 గ్రామాలను పైలట్ ప్రొగ్రామ్ కింద ఎంపిక చేసి రైతు భరోసా నిధులను విడుదల చేశారు. అప్పట్లో 4.42 లక్షల మంది రైతులకు(9.48 లక్షల ఎకరాలకు) రూ.569 కోట్లు కేటాయించారు. ఆ తరువాత 3 విడతల వారీగా మరికొందరికి రైతులకు డబ్బు జమ చేశారు. తొలి విడతలో ఎకరా భూమి ఉన్న 17.03 లక్షల మంది రైతులకు(9.29 లక్షల సాగుభూమికి) రూ. 557.54 కోట్లు అందజేశారు. రెండో విడతలో 13.23 లక్షల మంది రైతులకు(18.19 లక్షల ఎకరాలకు) రూ.1091.95 కోట్లు విడుదల చేశారు. మూడో విడతలో 10.13 లక్షల మంది రైతులకు (21.12 లక్షల ఎకరాలకు) రూ.1269.32 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశారు. ఇప్పుడు నాలుగో విడతలో నాలుగు ఎకరాలున్న రైతులు 9.12 లక్షల మంది ఉన్నట్టు అధికారులు అంచనా వేశారు. వీరందరికీ భరోసా ఇవ్వడానికి వెయ్యి కోట్లు అవసరమని లెక్క కట్టారు.
మార్చి నెలాఖరులోగా 5 ఎకరాలకు వర్తింపు
ఐదు ఎకరాల రైతులున్న భూములకు మార్చి 31లోగా రైతు భరోసా ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఐదు ఎకరాల రైతులకు డబ్బు చేస్తే… అర్హులైన రైతుల్లో 50 శాతం మందికి భరోసా నిధులు ఇచ్చేనట్టే అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే సన్న, చిన్నకారు రైతులందరికీ పెట్టుబడి సాయం పంపిణీ పూర్తయినట్టే అవుతుంది. మిగతా రైతులకు ఏప్రిల్ రెండో వారంలో నిధులు జమ చేయనున్నట్టు వ్యవసాయశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పెట్టుబడి సాయం పక్కదారి పట్టకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. వ్యవసాయానికి యోగ్యత లేని(బీడు, రాళ్లు రంపలు, గుట్టలు, కొండలు, రియల్వెంచర్లు, కాల్వలు, వాణిజ్య సముదాయాలు) భూములకు రైతు భరోసా బంద్ అని తెలియజేసింది. మరికొన్ని భూముల వివరాలను బ్లాక్లిస్టులో పెట్టింది. ఈ భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయి? ఎప్పటి నుంచి ఉన్నాయి? తదితర అంశాలపై ఆరా తీస్తోంది.