తెలంగాణలో టీడీఆర్ స్కాం.. తీవ్ర ఆరోపణలు చేసిన కేటీఆర్

V. Sai Krishna Reddy
1 Min Read

తెలంగాణలో భారీ స్కామ్ జరుగుతోందని, టీడీఆర్ బాండ్ల పేరుతో వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని టీమ్ సిద్ధమవుతోందని బీఆర్ఎస్ నేత కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌లో రేవంత్‌కు చెందిన నలుగురు వ్యక్తులు విచ్చలవిడిగా టీడీఆర్లు కొనుగోలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.అందాల పోటీపై విమర్శలు తెలంగాణ ప్రభుత్వం వివిధ కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్న నిధులపై కూడా కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ‘ఫార్ములా ఈ-రేసుకు రూ. 45 కోట్లు ఖర్చు చేయడాన్ని తప్పుపట్టిన వారు ఇప్పుడు అందాల పోటీకి రూ. 200 కోట్లు ఖర్చు చేయాలనుకుంటున్నారు. దీని వల్ల రాష్ట్రానికి ఎలాంటి లాభం?’ అని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రజాధనం వృథా చేస్తున్నదని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్ అసెంబ్లీకి హాజరు ఈ నెల 12 నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) హాజరుకానున్నారని కేటీఆర్ వెల్లడించారు. ‘బడ్జెట్ ప్రసంగంలో కేసీఆర్ పాల్గొంటారు. కానీ, కాంగ్రెస్ నేతలు అసెంబ్లీలో అబద్ధాలు, దూషణలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి సభకు ఆయన రావాల్సిన అవసరం లేదు’ అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. – ఫార్ములా ఈ-రేసు కేసు ఈనెల 16 తర్వాత ఫార్ములా ఈ-రేసు కేసులో తనను మళ్లీ విచారణకు పిలవనున్నారని కేటీఆర్ తెలిపారు. ఈ కేసులో తాను న్యాయపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగంతో ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేస్తోందని ఆయన ఆరోపించారు. ఈ ఆరోపణలపై అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *