ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో కోళ్లకు వైరస్ విషయం టెన్షన్ పెడుతోంది. ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లా పెరవలిలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయ్యింది
ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో కోళ్లకు వైరస్ విషయం టెన్షన్ పెడుతోంది. ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లా పెరవలిలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో మిగిలిన కోళ్లను నిర్మూలించేందుకు ప్రత్యేక బృందాలు ఫ్లూ వ్యాపించిన పౌల్ట్రీ ఫార్మ్ ల కు వస్తున్నాయి. ఫ్లూ నిర్ధారణ అయిన పౌల్ట్రీలో కోళ్లకు మత్తు ఇచ్చి చనిపోయేలా చేస్తున్నాయి.
అనంతరం ఆ కోళ్లను గొయ్యి తీసి పూడ్చిపెడుతున్నారు. ఈ సమయలో పౌల్టీ పరిశ్రమల వద్దకు చేరుకుంటున్న ప్రత్యేక బృందాలు పీపీఈ కిట్లు ధరించి కోళ్లకు ఎనస్తీషియా ఇస్తున్నారు. ఫలితంగా.. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది.