బాపట్ల జిల్లా కొల్లూరులోని ఎన్టీఆర్ ప్రాంగణంలో జరిగిన సంక్రాంతి ఉత్సవాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకల్లో భాగంగా కోడి పందాలను వినూత్నంగా కోడి పందేల లీగ్గా నిర్వహించారు.
నాలుగు జతల కోళ్ల మధ్య జరిగిన పోటీల్లో అత్యధిక విజయాలు సాధించిన కోడి పుంజు యజమాని ఉదయ భాస్కర్కు రూ.5.2 లక్షల విలువైన రెనో కారును బహుమతిగా అందజేశారు. రన్నరప్గా నిలిచిన కోడి పుంజు యజమానికి బుల్లెట్ బైక్ను అందజేశారు.
మూడు రోజుల పాటు సాగిన సంక్రాంతి సంబరాలు కొల్లూరులో ఘనంగా నిర్వహించగా, విజేతలకు ఎమ్మెల్సీ ఆలపాటి రాజా చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.
