‘రుద్ర’ ఓవర్‌సీస్ ఆధ్వర్యంలో ప్రజా జ్యోతి” క్యాలెండర్ ఆవిష్కరణ..

Warangal Bureau
1 Min Read

‘రుద్ర’ ఓవర్‌సీస్ ఆధ్వర్యంలో ప్రజా జ్యోతి” క్యాలెండర్ ఆవిష్కరణ

హనుమకొండ, జనవరి 08 (ప్రజా జ్యోతి):

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని రుద్ర ఓవర్‌సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో జాతీయ తెలుగు దిన పత్రిక ‘ప్రజా జ్యోతి’ క్యాలెండర్‌ను గురువారం ఘనంగా ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న రుద్ర ఓవర్‌సీస్ ప్రతినిధి మధుకర్ మూల మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకువచ్చే ప్రజా జ్యోతి పత్రిక పాత్ర అభినందనీయమని అన్నారు. విద్యార్థుల ఉన్నత భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేస్తున్న రుద్ర ఓవర్‌సీస్ సంస్థ సేవలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాల వైపు పయనించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ప్రజా జ్యోతి ప్రతినిధులు, రుద్ర ఓవర్‌సీస్ సంస్థ ప్రతినిధులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Rudra Overseas, Education Consultancy

(9550 35 35 35)

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *